మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య.ఈ సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
తన ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ ఇస్తున్న కొరటాల శివ ఈ సినిమాలో కూడా అలాంటి మెసేజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.చిరు, చరణ్ ఇద్దరి పాత్రలు చాలా ప్రత్యేకంగా రాసుకున్నట్టు తెలుస్తుంది.
అంతేకాదు సినిమాలో పొలిటికల్ సిస్టెం మీద సెటైర్లు కూడా ప్లాన్ చేశాడట కొరటాల శివ.ప్రస్తుతం రాజకీయ నాయకులు సమాజాన్ని ఎలా పాడుచేస్తున్నారన్న కోణంలో ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయట.
సినిమాలో మెసేజ్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయని తెలుస్తుంది.సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్నారు.
మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి మొదటి సాంగ్ లాహే లాహే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.మే నెలలో రిలీజ్ అవ్వాల్సిన ఆచార్య కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడ్డది ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది చిత్రయూనిట్ ప్రకటించాల్సి ఉంది.
మెగా ఫ్యాన్స్ మాత్రం ఆచార్య మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు.అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని చెబుతున్నారు.