టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ఆచార్య.ఇది చిరంజీవి 152 వ సినిమా గా తెరకెక్కుతుంది.
కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కి స్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా సిద్ద అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా సిద్ద అనే పేరుతో విద్యార్థి సంఘానికి నాయకుడిగా నటిస్తున్నాడు.
రామ్ చరణ్, పూజ ఈ సినిమాలో కొద్దీ సేపే కనిపించ బోతున్నప్పటికీ వీళ్ళ పాత్రలు సినిమాకే హైలెట్ గా ఉండబోతున్నాయని సమాచారం.ఈ సినిమాలో విలన్ గా సోనూసూద్ నటిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.
ఈ సినిమాలో చిరంజీవి దేవాలయాలు మరియు అనేక మాతపరమైన కార్యకలాపాలకు సంభందించిన విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు.ఈ సినిమాను కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా నుండి టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని అంచనాలను పెంచేసాయి.
అయితే ఈ సినిమా షూటింగ్ మరికొద్ది భాగం మాత్రమే బాలన్స్ ఉంది.మరొక 15 రోజులు షూటింగ్ చేస్తే ఈ మూవీ పూర్తి అవుతుంది.ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండడంతో మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు.ఆచార్య కూడా త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని మెగాస్టార్ కొరటాలకు కబురు చేశారట.
తొందరగా పూర్తి చేసి విడుదల చేయాలనీ మెగాస్టార్ కొరటాలకు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది.