మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది.
అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా పడిపోయింది.అయితే మరల ప్రస్తుతం షూటింగ్ లకి అనుమతి ఇవ్వడంతో చాలా మంది ఇప్పటికే షెడ్యూల్ ప్లాన్ చేసుకొని సెట్స్ మీదకి వెళ్తున్నారు.
ఇంకా ఎక్కువ రోజులు వేచి చూడటం కరెక్ట్ కాదని స్టార్ట్ చేసేస్తున్నారు.ఈ నేపధ్యంలో చిరంజీవి ఆచార్య కూడా మొదలవుతుందని అందరూ భావించారు.
అయితే ప్రస్తుతం పరిస్థితుల బట్టి సినిమా హెవీ క్యాస్టింగ్ తో కూడుకొని ఉండటంతో షెడ్యూల్ ప్లాన్ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.అదే సమయంలో చిరంజీవి 60 ఏళ్ళు దాటడంతో అతని ఆరోగ్యం దృష్ట్యా ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు మెగాస్టార్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ఒక వేళ షూటింగ్ స్టార్ట్ చేసిన అతను లేకుండా ఉన్న సన్నివేశాలు ప్రస్తుతానికి షూటింగ్ చేయాల్సి ఉంటుంది.షూటింగ్ స్టార్ట్ చేసిన తాను రెండు నెలల తర్వాతనే షూటింగ్ లో భాగం అవుతానని దర్శకుడు కొరటాలకి చిరంజీవి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో ఇప్పట్లో స్టార్ట్ చేసిన ఎక్కువ క్రౌడ్ ఉన్న సన్నివేశాలు షూట్ చేయడం జరిగే పని కాదు.దీంతో మరో రెండు నెలలు వేచి చూసి చిరంజీవి చెప్పిన ప్రకారమే నవంబర్ లో షూటింగ్ షెడ్యూల్ ఖరారు చేయాలని కొరటాల కూడా ప్లాన్ చేస్తున్నాడు.
అప్పటికి మరిన్ని లాక్ డౌన్ సడలింపులు ఉంటాయి కాబట్టి షూటింగ్ లో ఎక్కువ మంది ఉన్న ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు కాబట్టి రెండు నెలల తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసి వేసవిలో రిలీజ్ కి సిద్ధం చేయాలని అనుకుంటున్నారని తెలుస్తుంది.