ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ అయినా విషయం తెలిసిందే.ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా రోజులు అవుతున్నా వీరిద్దరూ తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వల్ల ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.
అయితే ఇటీవలే రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసి బయటకు వచ్చాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో రామ్ చరణ్ తన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాడు.ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసారు.ఈ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు స్టార్స్ కూడా పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి తో పాటు లెజెండ్రీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కూడా ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
వీళ్ళందరూ చరణ్ కు తమ బెస్ట్ విషెస్ తెలిపారు.
ఈ క్రమంలో చిరంజీవి రామ్ చరణ్ శంకర్ సినిమాపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.కొన్ని సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని అలాంటి సినిమాల్లో చరణ్ శంకర్ ప్రాజెక్ట్ ఉందని చిరంజీవి తెలిపారు.
అంతేకాదు శంకర్ తో సినిమా చేయడం తన డ్రీమ్ అని ఈ డ్రీమ్ చరణ్ ద్వారా తీరబోతుంది ఆయన తెలిపారు.
ఆ తర్వాత ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు, హీరోయిన్ కియారా అద్వానీ కి ఇంకా మిగతా టీమ్ అందరికి తన బెస్ట్ విషెస్ అందజేశారు.ఈ సినిమాను దిల్ రాజు చాలా ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్నాడు.ఎందుకంటే ఇది తన 50వ సినిమా.
ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా మరొకసారి నటించబోతుంది.ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ఉండబోతుంది.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
తాజా వార్తలు