పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాజకీయాలు దిగజారుతున్నాయని ఆయన అన్నారు.
ప్రస్తుతం రాజకీయాలు దిగజారుతున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు( Venkaiah Naidu ) ఆవేదన చెందుతున్నారని తెలిపారు.అలాగే రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, విమర్శలకు దిగుతున్నారని చెప్పారు.
అయితే ఈ పాలిటిక్స్( Politics ) లో ఒకరిని అనడం కానీ, ఒకరితో అనిపించుకోవడం కానీ తన వల్ల కాదని స్పష్టం చేశారు.దుర్భాషలాడే నేతలను తిప్పికొట్టే శక్తి కేవలం ప్రజలకే ఉందని తెలిపారు.అయితే హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో పద్మ పురస్కారాల విజేతలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించిన సంగతి తెలిసిందే.