మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత ఒక్కసారిగా ఆలోచన మార్చుకున్నట్లుగా ఉన్నాడు.అందుకే ఆయన సినిమాల ఎంపిక విషయంలో మార్పు వచ్చిందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి ఇప్పటి వరకు 151 సినిమాలు చేశాడు.152వ సినిమా గా లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ను చేయడం జరిగింది.153వ సినిమా గా వేదాళం రీమేక్ భోళా శంకర్ ను చేయడం జరిగింది.ఇక 154వ సినిమా గా చిరంజీవి మరియు బాబీ ల కాంబోలో సినిమా పట్టాలెక్కింది.
రవితేజ కీలక పాత్రలో మెగా 154లో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ రెండు రీమేక్ ల కంటే ఎక్కువగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పై అంచనాలు ఉన్నాయి.
అందుకే సంక్రాంతికి బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 154 సినిమా వాల్తేరు వీరయ్య సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.హీరో గా చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమా చాలా స్పెషల్ గా ఉంటుందని మెగా వర్గాల వారు అంటున్నారు.
చిరంజీవి హడావుడిగా ఈ సినిమాను చేయడం పట్ల కొందరు కామెంట్స్ చేస్తున్నారు.గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్ సినిమా ల పరిస్థితి ఏంటీ అంటూ ఈ సమయంలో మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఎప్పుడు భోళా శంకర్ సినిమా వస్తుందని కొందరు ప్రశ్నిస్తూ ఉంటే ఎప్పుడు గాడ్ ఫాదర్ ను తీసుకు వస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.ఆ రెండు సినిమా లపై చిరంజీవికి నమ్మకం లేక పోవడం వల్లే మొదట వాల్తేరు వీరన్న సినిమా ను విడుదల చేసే ఏర్పాట్లు చేస్తున్నారా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు.మొత్తానికి వాల్తేరు వీరన్న విడుదల తేదీ ని ప్రకటించడం తో ఆ రెండు సినిమా ల పరిస్థితి ఏంటో అన్నట్లుగా మెగా ఫ్యాన్స్ లో గందరగోళ వాతావరణం నెలకొంది.