టాలీవుడ్ ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హవా నడుస్తుంది.మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాకి పెద్దన్నగా ఉంటూ చిన్నసినిమా నుంచి పెద్ద సినిమా వరకు ఎవరు పిలిచినా వెళ్తూ వారికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు.
దాసరి తర్వాత ఆ స్థానంలో చిరంజీవి ని చాలా మంది దర్శక, నిర్మాతలు చూస్తూ ఉండటం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇవన్నీ పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.
తన చివరి ఊపిరి వరకు నటుడుగానే ఉంటానని రీసెంట్ గా ఓ షోలోకూడా చెప్పాడు.ఇక పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలు చేస్తూనే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు.
ఇప్పుడు గతంలో ఓ సభలో చర్చకొచ్చిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది.వీరిద్దరూ సినిమాలతో ప్రస్తుతం యాక్టివ్ గా ఉండటంతో నిర్మాత, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి ఈ కాంబినేషన్ లో సినిమా చేయడానికి మళ్ళీ పావులు కదుపుతున్నారు.
మెగాస్టార్, పవర్ స్టార్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చేస్తానని సుబ్బిరామిరెడ్డి ప్రామిస్ చేశాడు.అది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుందని కూడా ఖరారు చేశారు.అయితే పవన్ ఆ తరువాత పొలిటికల్ గా యాక్టివ్ అయిపోవడంతో ఇది కార్యరూపం దాల్చలేదు.ఇప్పుడు పవన్ మళ్ళీ సినిమాలు చేస్తూ ఉండటంతో సుబ్బిరామిరెడ్డి త్రివిక్రమ్ తో టచ్ లోకి వెళ్లి అన్నాదమ్ముల కాంబినేషన్ కోసం కథ సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తుంది.
దీనిపై త్వరలో అధికారికంగా క్లారిటీ ఇద్దామని కూడా చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్ఠీఆర్ తో తన నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అయ్యి ఉన్నాడు.
ఎం చేసిన ఆ సినిమా తర్వాతనే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.