మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మంచి స్పీడ్ మీద సినిమాలు చేస్తున్నాడు.ఆచార్య సినిమా సెట్స్ పైన ఉంది.
లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభించాలని అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే మలయాళం హిట్ మూవీ లూసీఫర్ ని వివి వినాయక్ దర్శకత్వంలో సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు.
ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.దీని తర్వాత వేదాళం రీమేక్ పై శ్రద్ధ పెట్టనున్నాడు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కథని కాస్తా చిరంజీవికి సరిపోయే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆవిష్కరించాడానికి రెడీ అవుతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రస్తుతం జరుగుతుంది.
డిజాస్టర్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న మెహర్ రమేష్ మీద చిరంజీవి నమ్మకం పెట్టుకొని ఈ సినిమా దర్శకత్వ బాద్యతలు అప్పగించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాని మార్చి నెలలో సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
అలాగే మార్చి ఆరంభంలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి దసరా ఫెస్టివల్ నాటికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని అంతే భారీగా తెరకెక్కించాలని మెహర్ భావిస్తున్నారు.
దానికోసం టాలెంటెడ్ టెక్నికల్ టీం మెంబర్స్ ని రంగంలోకి దించుతున్నారు.హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని కూడా త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.
మొదట కొంత భాగాన్ని అక్కడ షూట్ చెయ్యాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.