మెగా ఫ్యామిలీ నుండి వెంటనే గుర్తుకు రానంత మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.కాని హీరోయిన్గా మాత్రం కేవలం నిహారిక మాత్రమే ఎంట్రీ ఇచ్చింది.
నిహారిక హీరోయిన్గా నటించి మెప్పించింది.కాని కమర్షియల్ హీరోయన్గా మాత్రం ఆమెకు ఛాన్స్ దక్కడం లేదు.
ఆమె చేసిన సినిమాలు కమర్షియల్గా సక్సెస్ కాకపోవడంతో ఆమె సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదంటూ సమాచారం అందుతోంది.వెండి తెరకు నిహారిక గుడ్ బై చెప్పిందని సమాచారం అందుతోంది.
సినిమాకు గుడ్ బై చెప్పినా నటనకు మాత్రం ఆమె గుడ్ బై చెప్పలేదని తెలుస్తోంది.వెబ్ సిరీస్ల ద్వారా ప్రేక్షకులకు రెగ్యులర్గా టచ్లోనే ఉండాలని నిహారిక భావిస్తుంది.
మ్యాడ్ హౌస్ అనే ఒక వెబ్ సిరీస్ను నిహారిక నిర్మిస్తుంది.ఎంటర్టైన్మెంట్తో కూడిన కాన్సెప్ట్తో నిహారిక ఈ వెబ్ సిరీస్ను నిర్మిస్తుంది.
భారీ ఎత్తున అంచనాలున్న వెబ్ సిరీస్ ప్రసారం మొదలైంది.మొత్తం వంద ఎపిసోడ్స్తో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన నిహారిక మ్యాడ్ హౌస్ను నిర్మించడం మాత్రమే కాకుండా అందులో నటిస్తుందట.మొదటి ఎపిసోడ్లో నిహారిక కనిపించక పోయినా ముందు ముందు ఆమెదే కీలక పాత్ర ఉంటుందని తెలుస్తోంది.వీలుంటే తండ్రి నాగబాబున మరియు వరుణ్ను కూడా ఈ వెబ్ సిరీస్లో అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది.మొత్తానికి నిహారికకు నటనపై ఉన్న ఆసక్తి చూస్తుంటే ముచ్చటేస్తోంది.