మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య.ఈ మూవీలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్నరు.
మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ లాహే లాహే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.ఇక త్వరలోనే సినిమా నుండి చరణ్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
ఇదిలాంటే కరోనా సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ జరుపుకుంటున్న ఆచార్య సినిమా టాకీ పార్ట్ మొత్తం షూటింగ్ పూర్తి చేశారని చెప్పారు.కేవలం సినిమా రెండు సాంగ్స్ మినహా అంతా పూర్తి చేశారని ప్రకటించారు.
చిరు, చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఆచార్య సినిమాలో తండ్రికొడులు చేసే మ్యాజిక్ మెగా ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు.సినిమాలో చరణ్ పాత్ర ఉన్నంత సేపు అదరగొడతాడని తెలుస్తుంది.మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు.సినిమాను అక్టోబర్ లో కాని వచ్చే ఏడాది జనవరి మొదటివారంలో కాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఆచార్యతో మెగా ఫ్యాన్స్ అందరిని ఖుషి చేసేలా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు.