తెలుగులో “పిల్లా నువ్వు లేని జీవితం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన మెగా సుప్రీం హీరో “సాయి ధరమ్ తేజ్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవలే సాయి ధరమ్ తేజ్ తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన “ఉప్పెన” చిత్రంలో హీరోగా నటించిన సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ తన తమ్ము డు వైష్ణవ్ తేజ్ తో పాటూ నిహారిక మరియు వరుణ్ తేజ్ లతో కలిసి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా తన ఆల్ టైం ఫేవరేట్ క్రష్ గురించి స్పందించాడు.
ఇందులో మొదటగా నిహారిక యాంకర్ అవతారం ఎత్తి ఈ ముగ్గురితో రాపిడ్ ఫైర్ తో పలు ప్రశ్నలు అడిగింది. ఇందులో ఉప్పెన సినిమాలోని జల జల జలపాతం అనే పాటలో మాదిరిగా నిజ జీవితంలో జరిగితే తాము ఎలాంటి ఆహారాన్ని మరియు ఎవరితో కలిసి పడవలో ప్రయాణించడానికి వెళతారని సాయి ధరమ్ తేజ్ ని అడిగింది.
దీంతో సాయి ధరమ్ తేజ్ తాను తన ఫేవరెట్ చిత్రం “చంటబ్బాయి” చిత్రం చూస్తానని అలాగే తనకు ఇష్టమైనటువంటి “పులిహోర” ని తినడానికి తీసుకెళ్తానని ఇక తన ఆల్ టైం ఫేవరెట్ హీరోయిన్ లారిస్సా బోనేసి ని తన వెంట తీసుకెళ్తానని చెప్పుకొచ్చాడు.దీంతో ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తన క్రష్ గురించి తెలియజేయడంతో అప్పట్లో తిక్క సినిమా చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందని కానీ పలు అనివార్య కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయారని కొందరు చర్చించుకుంటున్నారు.
కానీ సాయి ధరమ్ తేజ్ ఇప్పటికీ లారిస్సా బోనేసి తో టచ్ లో ఉంటున్నాడు.అంతేగాక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లారిస్సా బోనేసి షేర్ చేసిన ఫోటోలకి లైకులు, కామెంట్లు కూడా పెడుతుంటాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తెలుగులో “రిపబ్లిక్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆ మధ్య సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “సోలో బ్రతుకే సో బెటర్” అనే చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో రిపబ్లిక్ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన టీజర్ కూడా విడుదల కాగా మంచి స్పందన లభించింది.