మెగా స్టార్ సినిమా అంటేనే మరో రేంజ్ లో ఉంటుంది.అలాంటిది ఒక్క సినిమాలో ఇద్దరు మెగా స్టార్ లు ఉంటే ఎలా ఉంటుందో ఒక సారి ఊహించుకోండి.
అది ఊహకు కూడా అందనంత అద్బుతంగా అనిపిస్తుంది కదా.అవును త్వరలో ఇద్దరు మెగా స్టార్ లు కలిసి ఒక సినిమాను చేయబోతున్నారు.ఇంతకు ఆ ఇద్దరు మెగా స్టార్ లు ఎవరో మీకు ఇప్పటికే అర్థం అయ్యింది కదా ఔను బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ మరియు టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి.వీరిద్దరు కలిసి గతంలో సైరా సినిమాలో కనిపించారు.అయితే సైరాలో అమితాబచ్చన్ గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే చేశాడు.కాని త్వరలో చేయబోతున్న సినిమాలో మాత్రం ఇద్దరు మెగాస్టార్ లు కూడా ఫుల్ లెంగ్త్ రోల్ ను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అమితాబచ్చన్ వద్దకు వచ్చిన ఒక కథ బాగా నచ్చిందట.ఆ కథలో రెండు ముఖ్య పాత్రల్లో తాను మరియు చిరంజీవి కలిసి నటిస్తే బాగుంటుందని భావించాడట.
అందుకే చిరంజీవి కి ఫోన్ చేసి విషయాన్ని చెప్పగానే వెంటనే ఓకే చెప్పాడట.చిరంజీవి ఓకే చెప్పడంతో పాటు షూటింగ్ కోసం డేట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తానంటూ హామీ ఇచ్చేశాడట.
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఈ సినిమా రూపొందే అవకాశం ఉంది.బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో ఏక కాలంలో రూపొందబోతున్న ఈ పాన్ ఇండియా సినిమా మరో రేంజ్ లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అభిమానులకు మెగా స్టార్ ఇవ్వబోతున్న అతి పెద్ద కానుకగా ఈ సినిమా నిలుస్తుందని కూడా అంటున్నారు.ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.