జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం పీఠం దక్కించుకోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు.ఏపీ మొత్తం తిరుగుతూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.
సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకుని మరి ఎన్నికల బరిలోకి వెళ్ళాడు.ఈ సమయంలో పవన్ కు ‘మెగా’ అండ ఎంత వరకు ఉంది అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.
మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం జనసేన ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగాడు.తమ్ముడి కి చేదోడు వాదోడుగా ఉన్నాడు.
కానీ మిగాతా కుటుంబ సభ్యుల అండ మాత్రం లభించలేదు.రామ్ చరణ్, చిరంజీవి, అల్లు అర్జున్ తదితరులు సైలెంట్ గా ఉండడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే మెగా స్టార్ చిరంజీవి తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ తరపున దిగబోతుండడం జనసేన కు పెద్ద షాకింగ్ న్యూస్ గా మారింది.చిరంజీవి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున ప్రచారం చేయడానికి నిర్ణయించుకున్నారు.
పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేన తరఫున బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి గురువారం ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొంటారు.జనసేన తెలంగాణలో సికింద్రాబాద్, మల్కాజిగిరి, నిజామాబాద్, మహబూబాబాద్ స్థానాల నుంచి తన అభ్యర్థులను బరిలోకి దింపిన విషయం అందరికి తెలిసిందే.
ఏపీలో తన తమ్ముడు పార్టీ ఉన్నా చిరంజీవి తన బంధువు కొండా విశ్వేశ్వరరెడ్డి తరపున ఈ నెల 8 న వికారాబాద్లో ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.చిరంజీవి ప్రచారం చేసే విషయంపై తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి మంగళవారం ప్రకటించారు.చిరంజీవి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ నేతలే.వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉంది.గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న చిరు ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారానికి దిగడం పవన్ కి ఇబ్బందికర పరిణామమే.