మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఖచ్చితంగా ఈ ఏడాది లో విడుదల అవుతుందనే నమ్మకం అందరిలో కనిపించింది.కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా.
పెద్ద సినిమాలు విడుదలకు సిద్దం అయిన కారణంగా ఆచార్య పోటీ ఎందుకు అనే ఉద్దేశ్యంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది.ఫిబ్రవరి లో ఆచార్య విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి అనేది నూటికి నూరు శాతం విడుదల అయ్యే తేదీనే.ఎందుకంటే ఇప్పటికే రెండు మూడు తేదీలు మార్చారు.
కనుక ఆ తేదీలో విడుదల ఖాయం.ఆచార్య సినిమా తో పాటు 2022 లో మరో రెండు సినిమా లను కూడా మెగాస్టార్ తీసుకు వస్తాడని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాల వారు కూడా వచ్చే ఏడాదిలో చిరంజీవి మొత్తం మూడు సినిమా లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా చెబుతున్నారు.ఆ మూడు సినిమా లు కూడా చిరంజీవి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి కూడా పండుగ తీసుకు వస్తుందనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి ఆచార్య సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.ఇక మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ ను చిరు గాడ్ ఫాదర్ గా చేస్తున్నారు.ఆ సినిమా బాక్సాఫీస్ వద్దకు వచ్చే ఏడాది సమ్మర్ లో రాబోతుంది.ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే అది కూడా సమ్మర్ చివర్లోనే విడుదల అవుతుందని అంటున్నారు.
తమిళ సినిమా వేదాళం కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే.ఈ మూడు సినిమాలు కాస్త అటు ఇటుగా ఆరు ఏడు నెలల గ్యాప్ లో విడుదల అవుతాయని అంటున్నారు.
ఈ మూడు సినిమా లు కూడా అంచనాలు భారీగా మోస్తున్నాయి.ఈ మూడు సినిమా లు కాకుండా చిరంజీవి తన తదుపరి సినిమాను బాబీ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే.
గాడ్ ఫాదర్ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యి సగం వరకు పూర్తి అయ్యింది.భోళా శంకర్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యింది.ఈ రెండు రీమేక్ లు భారీ స్టార్ కాస్టింగ్ తో రూపొందుతున్నాయి.ఆచార్య లో చరణ్ నటించిన విషయం తెల్సిందే.
అందుకే మూడు సినిమా లు హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.