వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించిన వెంకీ మామ చిత్రానికి దర్శకత్వం వహించిన బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేసే అవకాశం ఉందట.ఇప్పటికే కథను రెడీ చేయడంతో పాటు చిరంజీవికి కూడా వినిపించాడట.
జై లవకుశ వంటి సూపర్ హిట్ను దక్కించుకున్న బాబీ ప్రస్తుతం చిరంజీవితో సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట.ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని చేస్తున్న చిరంజీవి ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ చేయబోతున్నాడట.
ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే కొత్త సినిమాను బాబీ దర్శకత్వంలో చేసే అవకాశం ఉందట.
చిరంజీవి కొన్ని రోజుల క్రితం యంగ్ దర్శకుల దర్శకత్వంలో నటించాలనుకుంటున్నట్లుగా ప్రకటించాడు.
అందులో భాగంగానే బాబీ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడు.పవర్ వంటి సూపర్ హిట్ కథను చిరంజీవి కోసం రెడీ చేశాడట.
అద్బుతమైన స్క్రీన్ప్లేతో మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్లుగా సినిమాను రూపొందించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఆచార్య చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఆచార్య చిత్రం షూటింగ్ పూర్తి అయిన వెంటనే లూసీఫర్ రీమేక్ పనులు ప్రారంభం అవుతాయి.అదే సమయంలో బాబీ దర్శకత్వంలో సినిమాను కూడా చేస్తాడట.వచ్చిన గ్యాప్ను ఫిల్ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాడట.మెహర్ రమేష్తో కూడా ఒక సినిమాను చేసేందుకు చిరంజీవి ఓకే చెప్పాడట.మొత్తానికి చిరంజీవి యంగ్ దర్శకులతో వరుసగా సినిమాలు చేసి యూత్ ఆడియన్స్కు మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.