మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో అద్బుతమైన చిత్రాలను వైజయంతి మూవీస్ బ్యానర్పై నిర్మించిన ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ మెగా నిర్మాత అంటూ పేరు దక్కించుకున్నాడు.ఎన్నో అద్బుత చిత్రాలను నిర్మించి వందల కోట్ల ఆస్తులను కూడబెట్టిన అశ్వినీదత్ ఈ సమయంలో తన దాతృత్వంను చాటుకోవాల్సింది పోయి చాలా చిన్నతనంగా ప్రవర్తిస్తున్నాడు అనే విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
మద్యలో ఆర్థికంగా వెనుకబడ్డట్లుగా అనిపించినా కూడా అశ్వినీదత్ మళ్లీ పుంజుకున్నారనే విషయం తెల్సిందే.
మహానటి చిత్రం వంద కోట్ల వరకు ఆయనకు సంపాదించి పెట్టింది.
ఆ తర్వాత కూడా అశ్వినీదత్కు లాభాల పంట పండినది.ప్రస్తుతం ప్రభాస్తో భారీ బడ్జెట్ సినిమాను ఈయన నిర్మిస్తున్నాడు.
టాలీవుడ్ టాప్ నిర్మాతల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉండే నిర్మాత ఈయన.అలాంటి అశ్వినీదత్ తాజాగా సీసీసీకి ఇచ్చిన విరాళం విమర్శల పాలయ్యింది.కేవలం ఆయన అయిదు లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వడంను చాలా మంది తప్పుబడుతున్నారు.
కోట్లల్లో లాభాలు దక్కించుకుని సినీ కార్మికుల కష్టంతో కోట్లు సంపాదించే అశ్వినీదత్ వారు ఆపదలో ఉన్న సమయంలో మరీ దారుణంగా అయిదు లక్షల రూపాయల విరాళం ఇవ్వడం ఏంటీ అంటూ కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.
కాని వారికి తెలియని విషయం ఏంటీ అంటే ఇప్పటికే అశ్వినీదత్ తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల చొప్పున 20 లక్షలు ఇచ్చారు.తాజాగా అయిదు లక్షలు ఇవ్వడంతో మొత్తం పాతిక లక్షల విరాళం అయ్యింది.
ఇది తక్కువ మొత్తం ఏమీ కాదు.కొందరు ఇంకా ప్రముఖ నిర్మాతలు కనీసం లక్ష కూడా ఇచ్చేందుకు ముందుకు రాలేదు.
ఆ విషయాన్ని వారు గుర్తించాలి.