మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ మూవీ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ని మోహన్ రాజా కంప్లీట్ చేశారు.
మలయాళంలో మోహన్ లాల్ టైటిల్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.పృథ్వీరాజ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.
అలాగే హీరో పృథ్వీరాజ్ కూడా లూసిఫర్ మూవీలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు.ప్రస్తుతం ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తుండడంతో పృథ్వీరాజ్ చేసిన పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలనే ఆలోచనలో మోహన్ రాజా టాలీవుడ్ యువ హీరో అందర్నీ కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగాహీరో నటిస్తేనే మంచి హైప్ వస్తుందని టాక్ కూడా ఉంది.ఈ నేపథ్యంలో ముందుగా ఆ పాత్ర కోసం రామ్ చరణ్ ను తీసుకోవాలని అనుకున్న కూడా ఎందుకనో మళ్లీ వెనక్కి తగ్గారు.
అయితే ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ఆ పాత్రకోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.పెదనాన్నతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోడానికి వరుణ్ తేజ్ కూడా ఆసక్తిగానే ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.ఈ కాంబినేషన్ అనేది నిజమైతే మాత్రం లూసిఫర్ మరోసారి మెగా మల్టీస్టారర్ మూవీగా అయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం ఆచార్య మూవీలో మెగాస్టార్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు.
మెగా మల్టీ స్టారర్ చిత్రంగానే ఇది కూడా తెరకెక్కుతుంది.తండ్రికొడుకులు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీని మీద అంచనాలు ఉన్నాయి.
ఇప్పుడు చిరంజీవి, వరుణ్ తేజ్ కాంబినేషన్ లూసీఫర్ కోసం సెట్ అయితే సెన్సేషన్ అవుతుందని చెప్పొచ్చు.