టాలీవుడ్ లో ఎక్కువగా యాడ్స్ చేసే వారి జాబితాలో మహేష్ బాబు ముందు ఉంటాడు.సాఫ్ట్ డ్రింక్ ఉత్పత్తుల నుంచి షొప్స్ వరకు చాలా వాటికి మహేష్ బాబు తెలుగులో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
యాడ్స్ ద్వారా సూపర్ స్టార్ ప్రతి ఏడాది కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నాడు.అయితే యాడ్స్ అయితే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ కూడా బ్రాండింగ్ ప్రమోషన్ లో భాగం అవుతున్నాడు.
అలాగే విజయ్ దేవరకొండ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్స్ కూడా ఈ యాడ్స్ ద్వారా భాగానే వెనకేసుకుంటున్నారు.
ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా యాడ్స్ లోకి అడుగుపెట్టాడు.
వరుస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్న వరుణ్ తేజ్ మోడల్ కి సరిపోయే అపీరియన్స్ ఉంది.దీంతో ఈ మధ్యకాలంలో మోడల్ గా ఫోటోషూట్ లు కూడా చేసుకున్నాడు.
తాజాగా నాగార్జున సిమెంట్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఈ మేరకు నాగార్జున సిమెంట్స్ యాజమాన్యం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించింది.
అయితే, ప్రచారకర్తగా వ్యవహరించేందుకు వరుణ్ తేజ్ కు ఎంత మొత్తం చెల్లించారు అనేది తెలియరాలేదు.దేశంలో సిమెంట్ బ్రాండ్లలో నాగార్జున సిమెంట్ కి మంచి గుర్తింపు ఉంది.