అనామకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంపూర్నేష్ అతి కొది కాలంలోనే బర్నింగ్ స్టార్ సంపూర్నేష్బాబుగా మారిపోయాడు.ఈయన మొదటి సినిమా ‘హృదయ కాలేయం’ సినిమా అందరి దృష్టిని ఆకర్షంచింది.
ఆ తర్వాత ఈయన నటించిన పలు సినిమాల్లో కామెడీతో ఆకట్టుకున్నాడు.తాజాగా ‘సింగం123’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుని, నిర్మాతకు లాభాల పంట పండేలా చేసింది.ఇక ఈయన ప్రస్తుతం మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్తే… ప్రతి సంవత్సరం జరిగే సైమా అవార్డు వేడుకలో ఈ సంవత్సరంకు గాను బెస్ట్ డెబ్యూ హీరో క్యాటగిరీకి గాను సంపూర్నేష్బాబు నామినేటెడ్ అయ్యాడు.సంపూతో పాటు మెగా హీరోలు సాయిధరమ్ తేజ్(పిల్లానువ్వులేని జీవితం) మరియు వరుణ్ తేజ్(ముకుంద)లు నామినేటెడ్ అయ్యారు.
ఈ ఇద్దరు మెగా హీరోలను కాదని సంపూకు ఆ అవార్డు వెళ్తే మెగా ఫ్యాన్స్ తల కొట్టేసినట్లే అని భావిస్తున్నారు.అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘ముకుంద’ సినిమాకు గాను వరుణ్ తేజ్కు ఈ అవార్డు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
లేకుంటే సంపూకు వస్తే మాత్రం రచ్చ రచ్చే…!
.