మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు గా సినీ పరిశ్రమకు పరిచయమైన నటుడు సాయి ధరమ్ తేజ్.టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్న సాయి ధరమ్ తేజ్.
సినిమాలలో నటించి మెగా ఫ్యామిలీ లో ఒక్కడిగా గుర్తింపు పొందాడు.ఇటీవలే తన తమ్ముడు వైష్ణవి తేజ్ కూడా ఉప్పెన సినిమా తో సినీ పరిశ్రమకు పరిచయం కానున్నాడు.
2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమ లో అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది.అంతేకాకుండా ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందింది.
ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిన సాయి కు కొన్ని సినిమాలలో అంతగా హిట్టు లేకపోయినా.మొత్తానికి ప్రతి రోజు పండగే, విన్నర్ వంటి సినిమాలతో మంచి విజయాన్ని సాధించుకున్నాడు.
ఇదిలా ఉంటే సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సినిమాలో నటించిన సాయి ధరమ్ తేజ్ కు మంచి విజయంతో విడుదల కాగా ఈ సినిమా తరువాత మరో సినిమా అవకాశం వచ్చింది.
దేవకట్ట దర్శకత్వంలో వస్తున్న రిపబ్లిక్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుండగా.సాయి ధరమ్ తేజ్ కు ఈ నేపథ్యంలో మొదటి సినిమాగా అవకాశం వచ్చింది.
ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమా ఈ ఏడాది జూన్ 4న విడుదల కానుంది.అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ విజయ్ అనే కొత్త డైరెక్టర్ వినిపించిన కథకు ఓకే అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే బీవీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో మరో సినిమాలో నటించనున్నాడు.మొత్తానికి సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఓ స్టార్ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.