మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి అదుగో ఇదుగో అంటూ ఈ ఏడాది ఆరంభంలో తెగ ప్రచారం జరిగింది.సాయి ధరమ్ తేజ్ అమ్మ గారు కొడుకు పెళ్లి కోసం చాలా తొందర పడుతోందని.
ఆమె తన అన్న చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ పెళ్లి విషయమై పలు సందర్బాల్లో చర్చించడం.ఆయన కూడా అల్లుడు తేజ్ కు పెళ్లి చేసుకోమని చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
మూడు పదుల వయసు వచ్చిన కారణంగా సాయి ధరమ్ తేజ్ పెళ్లికి ఫిక్స్ అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి.పెళ్లి ముచ్చట్లు అలా ఆగిపోయాయో యాక్సిడెంట్ తో తేజ్ వార్తల్లో నిలిచాడు.
ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ కూడా విడుదల అయ్యింది.యాక్సిడెంట్ నుండి పూర్తిగా కోలుకుని ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు.
దసరా రోజు సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు అంటూ చిరంజీవి స్వయంగా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ చాలా రిలాక్స్ అయ్యారు.
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నూటికి నూరు శాతం బెటర్ అయ్యింది.ఆయన రెండు లేదా మూడు నెలల్లో రెగ్యులర్ గా షూటింగ్ లకు హాజరు అవుతాడు.ఈ లోపు ఆయన కెమెరా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇదే సమయంలో ఆయన పెళ్లి గురించిన చర్చ మొదలు అయ్యింది.సాయి ధరమ్ తేజ్ పెళ్లికి సంబంధించిన చర్చలు స్పీడ్ అందుకున్నాయి అంటున్నారు.
బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడు అనే కోపంతో అతడి కుటుం సభ్యులు త్వరలోనే అతడికి పెళ్లి చేయాలని పట్టుదలతో ఉన్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే ఒక అమ్మాయికి కూడా ఓకే చెప్పాడు అనేది చాలా మంది చెబుతున్న విషయం.
సాయి ధరమ్ తేజ్ చాలా కాలంగా ఇంట్లో చూసిన సంబంధంను చేసుకుంటాను అన్నాడు.అన్నట్లుగానే మామయ్య ఓకే చెప్పిన అమ్మాయి మెడలో తాళి కట్టేందుకు సిద్దం అవుతున్నాడట.
సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి మరింత స్పష్టత రావాల్సి ఉంది.