పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకి వస్తున్న సినిమా వకీల్ సాబ్.అతన్ని తెరపై చూడగా ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ అందరూ కూడా ఏప్రిల్ 9 కోసం చాలా ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా జరిగిన ట్రైలర్ తర్వాత సినిమా హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది.పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
బాలీవుడ్ హిట్ మూవీ పింక్ కి రీమేక్ గా ఈ సినిమా తెరకేక్కుతూ ఉంటడం, అది కూడా పవర్ పవన్ కళ్యాణ్ సినిమాలో లాయర్ పాత్రలో కనిపిస్తూ ఉండటంతో కంటెంట్ పరంగా కూడా ప్రెజెంట్ ట్రెండ్ గా కరెక్ట్ గా సరిపోయేది కావడం సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి.ఇక అందరి అంచనాలు అందుకునే విధంగానే వకీల్ సాబ్ సినిమా ఉండబోతుందనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో శృతి హసన్, పవన్ కలిసి మూడో సారి నటించారు.అలాగే అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఉండటం సినిమాకి అదనపు బలం.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో ప్రత్యేకత కూడా ఉందనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది.ఈ సినిమాలో మెగా హీరో ఒకరు గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తుంది.
అయితే అది ఎవరనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.సినిమాలో క్యామియో తరహా పాత్రలో మెగా హీరో కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది.
అయితే ఆ పాత్రలో కనిపించాబోయేది రామ్ చరణ్ కాని సాయి ధరమ్ తేజ్ కాని అయ్యుండొచ్చు అని టాక్ నడుస్తుంది.