మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి ఒక్క షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది.
కాని కరోనా కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది.ఈ చిత్రంలో హీరోయిన్గా సాయి మంజ్రేకర్ను ఎంపిక చేయడం జరిగింది.
ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ పాత్రకు గాను లావణ్య త్రిపాఠిని ఎంపిక చేయడం జరిగిందట.
వరుణ్కు జోడీగా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేయడం పట్ల మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇది ఎంత మేరకు కరెక్ట్ విషయం కాదంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.పలువురు మెగా ఫ్యాన్స్ కూడా లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో నటించడం వద్దంటూ సోషల్ మీడియా ద్వారా మేకర్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.గతంలో వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చి అది ఫ్లాప్ అవ్వడం వల్లే ఇప్పుడు ఫ్యాన్స్ ఈ కాంబోను కోరుకోవడం లేదు.
మిస్టర్ చిత్రంలో వరుణ్ ఇంకా లావణ్య త్రిపాఠి జంటగా నటించారు.శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది.
అందుకే మళ్లీ వీరిద్దరు కలిసి నటిస్తున్నారు అనగానే బాబోయ్ అంటూ మెగా ఫ్యాన్స్ ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి ఫుల్ లెంగ్త్ హీరోయిన్ కాదు కనుక ఇబ్బంది లేదు అంటూ మేకర్స్ చెబుతున్నారు.
అయినా కూడా బ్యాడ్ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు.లావణ్య త్రిపాఠికి ప్రస్తుతం పెద్దగా క్రేజ్ కూడా లేదు.ఎందుకు ఈ సమయంలో ఇలా చేయడం అంటున్నారు.
—