బాహుబలి….బాహుబలి…బాహుబలి ఇప్పుడు ఏ ఇద్దరు కలుసుకున్నా వారి నోటి వెంట ఇదే మాట వినపడుతోంది.తొలి పార్ట్ రూ.600 కోట్ల వసూళ్లు, రెండో పార్ట్కు రూ.600 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్…రూ.1000 కోట్ల వసూళ్ల టార్గెట్….ఇలా రిలీజ్కు ముందే ఎన్నో సంచలనాల మధ్య థియేటర్లలోకి వస్తోన్న ఈ సినిమా వెనక ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్తో పాటు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్గా సెగలు పుట్టిస్తోంది.
బాహుబలి సినిమాకు అటు ఏపీలోను, ఇటు తెలంగాణలోను అదనపు షోలకు అనుమతులు ఇచ్చారు.ఏపీలో అయితే ఏకంగా తొలి 10 రోజుల పాటు రోజుకు 6 షోలు వేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు.
తెలంగాణలో రోజుకు 5 షోలకు అనుమతులు వచ్చాయి.ఇదే అంశం ఇప్పుడు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అనుచరులతో పాటు వారి ఫ్యాన్స్కు మంటపుట్టిస్తోంది.
తొలివారం రోజుల పాటు మెగాఫ్యాన్స్ అనేవారు ఎవరూ కూడా బాహుబలి చూడకూడదంటూ ఫేస్ బుక్ పోస్టింగ్లు స్ప్రెడ్ అవుతున్నాయి.మెగా హీరోల సినిమాలు ఖైదీ నెంబర్ 150, కాటమరాయుడు సినిమాల షోలకు అనుమతులు ఇవ్వకుండా వివక్ష చూపారని…ఇందుకు బదులుగా తొలి పది రోజులు మెగా ఫ్యామిలీ హీరోల ఫ్యాన్స్ ఎవ్వరూ బాహుబలి చూడకూడదంటూ ఆ పోస్టింగుల్లో పెడుతున్నారు.
మరి ఈ వివాదం ఎటు మలుపులు తిరుగుతుందో చూడాలి.