వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరోలు గా తమన్నా మెహ్రీన్ లు హీరోయిన్స్ గా రూపొందిన ఎఫ్ 3 సినిమా విడుదలకు సిద్దం గా ఉంది.ఎఫ్ 2 సినిమా సూపర్ డూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా ఎఫ్ 3 ఉంటుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.కాని అసలు విషయం ఏంటీ అంటే ఎఫ్ 2 కు ఎఫ్ 3 కి అసలు సంబంధం లేదు.
కథ విషయంలో ఎక్కడ కూడా కనెక్షన్ లేదు.సీక్వెల్ లో కేవలం పాత్రలను కంటిన్యూ చేయడం జరిగింది.
ఆ పాత్రల యొక్క బాడీ లాంగ్వేజ్ కంటిన్యూ అవుతుంది.అంతే తప్ప అదే కథను కొసాగిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు.
ఇక సినిమా ట్రైలర్ విడుదల తర్వాత సినిమా కచ్చితంగా ఎఫ్ 2 కంటే ఎక్కువ ఎంటర్ టైన్మెంట్ ను ఇస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.తప్పకుండా ఎఫ్ 3 సినిమా మరో వంద కోట్ల సినిమా గా అనీల్ రావిపూడికి నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్ 3 సినిమా పై ఉన్న అంచనాలు ఒక ఎత్తు అయితే సినిమా పై మెగా అభిమానులు చేస్తున్న విమర్శలు ఒక ఎత్తు అయ్యింది.సినిమాలో వరుణ్ తేజ్ ను నత్తి వాడిగా చూపించబోతున్నారు.
ట్రైలర్ లోనే ఆ విషయాన్ని క్లారిఫై చేయడం జరిగింది.ఖచ్చితంగా వరుణ్ తేజ్ పాత్ర సినిమాకు ఆకర్షణీయంగా ఉంటుందని నమ్ముతున్నాం.
కాని ఆయన కు నత్తి అనే పేరు చెప్పి పరువు తీసేలా సన్నివేశాలు చేశారు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.దర్శకుడు అనీల్ రావిపూడిని మెగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఏకి పారేస్తున్నారు.
మా హీరో ను కాస్త బాగా చూపించాల్సింది అంటూ అసహనంపు వ్యాఖ్యలు చేస్తున్నారు.మరో వైపు వెంకటేష్ ను రేయి చీకట్ల సమస్య ఉన్న వ్యక్తిగా చూపించడం కూడా అభిమానులు విమర్శిస్తున్నారు.
కథ బలంగా ఉంటే ఇలా లోపంతో చూపించినా పర్వాలేదు.కాని కేవలం కామెడీ కోసం అలా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటున్నారు.