‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత చరణ్ చేస్తున్న సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ను షూట్ చేస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని, ప్రస్తుతం చేస్తున్న యాక్షన్ సీన్స్ పూర్తి అయితే చిత్రీకరణ పాటలు మినహా మొత్తం పూర్తి అయినట్లే అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
షూటింగ్ ఇంత స్పీడ్గా చేయడం ఏంటని ప్రస్తుతం విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నాడు.
ఈమద్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు అంటే కనీసం ఆరు నెలల సమయం అయినా పడుతుంది.భారీ సెట్టింగ్స్, విదేశీ లొకేషన్స్, పెద్ద పెద్ద షెడ్యూల్స్ ఇలా అన్ని కలుపుకుని కనీసం ఆరు నెలల పాటు అయినా షూటింగ్ జరిపితేనే సినిమా బాగుంటుంది.అలా కాదని, కేవలం మూడు నెలల్లోనే బోయపాటి ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు.
ఆశ్చర్యకరంగా మూడు నెలల్లోనే చరణ్ మూవీ షూటింగ్ పూర్తి అవ్వడం చూస్తే ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.ఇంత స్పీడ్గా పూర్తి అయిన ఈ సినిమా ఆకట్టుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రంగస్థలం వంటి మంచి సినిమా చేసిన చరణ్ తన తదుపరి చిత్రంతో డిజాస్టర్ చవి చూస్తాడా ఏంటీ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన రామ్ చరణ్, బోయపాటిల చిత్రం ఇంత త్వరగా పూర్తి అవ్వడంతో నలుగురు నాలుగు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
బోయపాటి శ్రీను తన గత చిత్రాలను ఎక్కువ సమయం తీసుకుని చిత్రీకరించాడు.కాని ఈ సినిమాను మాత్రం ఎందుకు ఇంత త్వరగా ఫినీష్ చేశాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
సినిమా పాటలు మినహా షూటింగ్ పూర్తి అయ్యింది అంటూ మీడియాలో వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా స్పందించాల్సి ఉంది.
సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తాను అంటూ చరణ్ ప్రకటించిన నేపథ్యంలో అప్పుడే షూటింగ్ ఎలా పూర్తి అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.
అప్పుడే షూటింగ్ పూర్తి అయితే సంక్రాంతి వరకు విడుదల చేయకుండా ఎందుకు ఉంటారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి చరణ్ కొత్త సినిమా గురించి మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.
ఆ వార్తలపై దర్శకుడు బోయపాటి ఎలా స్పందిస్తాడో చూడాలి.