నాగ్‌ అశ్విన్‌పై మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహం

మహానటి చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నాగ్‌ అశ్విన్‌ తదుపరి చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవితో చేయాలని కథను సిద్దం చేసుకున్నాడట.అశ్వినీదత్‌ మరియు చిరంజీవిల కాంబోలో చాలా సినిమాలు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

 Mega Fans Angry On Nag Ashwin-TeluguStop.com

కనుక వీరిద్దరి కాంబోలో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమా అదిరి పోతుందని అంతా భావించారు.కాని అనూహ్యంగా సినిమా ఆగిపోయింది.

చిరంజీవి బిజీ షెడ్యూల్‌ కారణంగా ప్రాజెక్ట్‌ చేతులు మారినట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Fans, Nag Aswin, Nagaaswin-Movie

నాగ్‌ అశ్విన్‌ ఇటీవల ప్రభాస్‌కు కథ చెప్పి ఓకే చెప్పించుకున్నాడు.భారీ బడ్జెట్‌తో అశ్వినీదత్‌ ఆ సినిమాను నిర్మించబోతున్నాడు.రికార్డు స్థాయి బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేస్తామంటూ నాగ్‌ అశ్విన్‌ ప్రకటించాడు.ఈ సమయంలోనే నాగ్‌ అశ్విన్‌ పై మెగా ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

మెగాస్టార్‌ కోసం అనుకున్న కథను ప్రభాస్‌తో ఎలా తీస్తారు.చిరంజీవి కాస్త టైం అడిగితే మరో హీరోతో కమిట్‌ అవుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు.సోషల్‌ మీడియాలో నాగ్‌ అశ్విన్‌ను వందల మంది మెగా ఫ్యాన్స్‌ ఈ విషయమై ప్రశ్నిస్తున్నారు.చిరంజీవితో ఎందుకు కాదనుకున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఆరు నెలలు ఆగలేక పోయారా అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.మరి వీటికి నాగ్‌ అశ్విన్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube