మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన సినిమా పరిశ్రమ మీటింగ్ పై ఆ తర్వాత కేసీఆర్తో చిరంజీవి మరియు ఇతర సినీ ప్రముఖులు భేటీ అయిన విషయమై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపుతున్నాయి.ఇండస్ట్రీ పెద్దగా నన్ను ఎవరు ఆహ్వానించలేదు.
ఆ భేటీ ఎందుకు జరిగిందో నాకు తెలియదు.భేటీ అయ్యి హైదరాబాద్ భూములు పంచుకున్నారేమో అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారంను రేపుతున్నాయి. సాదారణంగా ఇలాంటి భేటీలు మరియు చర్చలు గతంలో దాసరి నారాయణ రావు నిర్వహించే వారు.ఇండస్ట్రీ పెద్దగా ఆయన చేసిన ప్రతి కార్యక్రమంకు అందరు స్వచ్చందంగా ముందుకు వచ్చి మద్దతు ఇచ్చే వారు.
కాని ప్రస్తుతం ఆ పోస్ట్ను చిరంజీవి తీసుకోగా కొందరు మాత్రం దాన్ని సమర్థించడం లేదు.ఏ అర్హతతో చిరంజీవి పెద్దరికం చేస్తాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.మంచి చేసేందుకు ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా చిరంజీవి గారు వచ్చి మంచి చేస్తానంటే ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
చిరంజీవి కాకుండా సినిమా పరిశ్రమ గురించి దాసరి మొన్నటి మీటింగ్ నిర్వహించి ఉంటే, కేసీఆర్ తో దాసరి సినీ ప్రముఖులను తీసుకు వెళ్లి భేటీ అయ్యి ఉంటే బాలకృష్ణ ఏమైనా ప్రశ్నించేవారా అంటూ మెగా ఫ్యాన్స్ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దాసరి చేసినప్పుడు రాని ఆగ్రహం చిరంజీవి చేస్తేనే ఎందుకు వస్తుంది.చిరంజీవి అంటే ఈగోతోనే బాలయ్య ఇలా చేస్తున్నాడు అంటూ మెగా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.