మెగా కుటుంబం గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవలే మెగా ప్రిన్సెస్ కొణిదెల నిహారిక పెళ్లి వేడుకలు ఘనంగా జరగగా….
ఐదు రోజుల పెళ్లి సందడిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉన్నారు.కాగా ప్రస్తుతం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ అల్లు కుటుంబం తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డిసెంబర్ 25 క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ప్రతి ఒక్కరూ క్రిస్మస్ పండుగ రోజు ప్రార్థనలు చేసి… వేడుకలలో పాల్గొంటున్నారు.
ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ కొణిదెల రామ్ చరణ్, ఉపాసన లు క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు.ఇందులో అల్లు అర్జున్, రామ్ చరణ్ కుటుంబాలు ఉండగా… ఇటీవలే ఓ ఇంటి కోడలు అయిన నిహారిక తన భర్తతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
కాగా ఈ ఫోటోను షేర్ చేసిన అల్లు శిరిష్ ఈ పండుగ వేడుకలను హోస్టింగ్ చేసిన ఉపాసన, రామ్ చరణ్ లకు థాంక్స్ చెప్తూ… ఈ పండుగలో బాగా సందడి చేశామని అంతేకాకుండా సీక్రెట్ శాంతా కూడా ఆడామని తెలిపారు.
ఇలా రామ్ చరణ్ తన చెల్లి పెళ్లి నుండి ఇప్పటి వరకు సందడి లతో బిజీగా ఉండటమే కాకుండా….ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో వస్తున్న వినయ విధేయ రామ సినిమాలో మరో హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో తన పాత్రతో మరింత బిజీ గా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 80% పూర్తి కాగా వచ్చే ఏడాదిలో విడుదల చేస్తామని సినీ నిర్మాతలు తెలుపుతున్నారు.