సెలబ్రెటీలు దాదాపు అంతా కూడా ఏదో ఒక బ్రాండ్ను ప్రమోట్ చేస్తూనే ఉంటారు.సోషల్ మీడియా ద్వారానో లేదా మరో మీడియా ద్వారానో ప్రమోట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మరియు ఆమె భర్త కళ్యాణ్ కూడా సోషల్ మీడియా ద్వారా బ్రాండ్ అంబాసిడర్స్గా వ్యవహరించారు.తాజాగా వీరు పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
అన్నపూర్ణ గోధుమ పిండిని వీరు ప్రమోట్ చేశారు.కళ్యాణ్ దేవ్ చెపాతీలు చేసి శ్రీజకు వడ్డించే వీడియోను పోస్ట్ చేశారు.అన్నపూర్ణ ఆటా ద్వారా మీ ప్రేమను షేర్ చేసుకోండి.మీకు నచ్చిన వివిధ షేప్స్లో చెపాతీలను చేసి మాతో షేర్ చేసుకోండి.
అన్నపూర్ణ పిండితో అందరి అభిమానంను పొందండి అంటూ ఈ సందర్బంగా జంట పిలుపునిచ్చింది.ప్రస్తుతం వీరి వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించడంతో అన్నపూర్ణ ఆటాకు మంచి పబ్లిసిటీ దక్కింది.
హీరోగా ఇప్పటికే ఒక సినిమా చేసిన కళ్యాణ్ దేవ్ రెండవ సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్ మద్యలో ఆగింది.లాక్ డౌన్ పూర్తి అయిన వెంటనే తదుపరి షెడ్యూల్ పూర్తి చేసి విడుదలకు సిద్దం చేయబోతున్నారు.మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో రెండవ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందా చూడాలి.