నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక కొంత కాలంగా మెగా డాటర్.
నిహారిక కొణిదెల సినిమాలు చూస్తూ.తనదైన శైలిలో రివ్యూలు కూడా ఇస్తోంది.
ఇప్పటికే క్రాక్, మాస్టర్ సినిమాల గురించి రివ్యూ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాంబీ రెడ్డి’ మూవీపై తనదైన శైలిలో స్పందించడంతో పాటు రివ్యూ కూడా ఇచ్చేసింది.
ఇక ఇంద్ర చిత్రంలో చిన్నప్పటి చిరంజీవిగా నటించడంతో పాటు పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన తేజ సజ్జ జాంబీ రెడ్డి చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు.దక్ష, ఆనంది కథానాయికలుగా నటించారు.
ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబడుతుంది.అయితే ఈ సినిమాపై మెగా డాటర్ నిహారిక తాజాగా రివ్యూ ఇచ్చింది.
ఈ మధ్య కాలంలో నిహారిక వరుసగా సినిమాలు చూస్తూ వాటిపై తన ఒపీనియన్ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంది.తాజాగా జాంబీ రెడ్డి సినిమాను సూపర్ డూపర్ అంటూ ప్రశంసలు కురిపించింది.ఇప్పుడే జాంబీరెడ్డి సినిమాను చూశాను.తెలుగులో ఇది మొదటి జాంబీ చిత్రం.కామెడీతో ఫుల్ ఎంటర్టైన్ చేశారు.ప్రశాంత్ వర్మ నువ్వు అదరగొట్టావ్.తేజ నీ నటన అద్భుతం.20 ఏళ్ల అనుభవం కనిపించిందంటూ సెటైర్ వేసింది.
ఇక ఈ సినిమాలో దక్ష, ఆనంది, గెటప్ శ్రీను, హేమంత్ ఇలా అందరూ కూడా బాగా నటించారు.మార్క్స్ అందించిన సంగీతంతో సినిమా మరో స్థాయికి వెళ్లింది.
మేకప్, ప్రోస్థటిక్ డిపార్ట్మెంట్ అదిరిపోయింది.బ్లడీ బ్లాక్ బస్టర్ కొట్టినందుకు జాంబీరెడ్డి టీంకు కంగ్రాట్స్ అంటూ నిహారిక తన పోస్ట్లో పేర్కొంది.
ఈ సినిమాకు ‘జాంబిరెడ్డి.రివెంజ్ ఆఫ్ ది డెడ్’ పేరుతో సీక్వెల్కు సన్నాహాలు చేస్తున్నారు ప్రశాంత్ నీల్.