మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే నిహారిక నటిగా మంచి పేరును సొంతం చేసుకున్నారు.పెళ్లి తర్వాత నిహారిక సినిమా ఇండస్ట్రీకి దూరమవుతారని చాలామంది భావించినా నటిగా, నిర్మాతగా నిహారిక కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
తాజాగా నిహారిక సోషల్ మీడియాలో గోరింటాకు పెట్టుకున్న ఫోటోను షేర్ చేశారు.ఆషాడ మాసం మొదలవబోతున్న నేపథ్యంలో నిహారిక గోరింటాకును పెట్టుకుని సరదా తీర్చుకున్నారు.
సెలబ్రిటీ అయినప్పటికీ కోన్ కాకుండా గోరింటాకు పెట్టుకుని నిహారిక సరదాను తీర్చేసుకున్నారు.నిహారిక గతంలోనే ఫోటోను దిగగా తాజాగా థ్రో బ్యాక్ అంటూ ఈ ఫోటో గురించి ఆమె రాసుకొచ్చారు.
నిహారిక షేర్ చేసిన ఫోటోకు భారీ సంఖ్యలో లైక్స్ వస్తుండగా నెటిజన్లు ఈ ఫోటో గురించి తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.మెగా ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి నటి నిహారిక కావడం గమనార్హం.
నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఒక మనస్సు సినిమాతో నిహారిక నటిగా తన కెరీర్ ను మొదలుపెట్టారు.మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో నిహారిక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.నిహారిక చివరగా సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే నిహారిక వెబ్ సిరీస్ లలో కూడా నటించారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నిహారిక సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ ను పెడుతూ ఆ పోస్ట్ ద్వారా నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.నిహారికకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 2 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం గమనార్హం.నిహారిక నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా నటిగా ఆమెకు మంచి పేరు వచ్చింది.