బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా గుర్తింపు పొందిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.చాలాకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇటీవల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.
రాజస్థాన్లోని జైసల్మీర్లోని సూర్యగఢ్ ప్యాలెస్ వేదికగా వేదమంత్రాల సాక్షిగా అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు , బంధుమిత్రులతో పాటు పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
వీరి వివాహానికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది.
ఇదిలా ఉండగా ఈ నూతన దంపతులకు మెగా కోడలు ఉపాసన కామినేని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది.అసలు విషయం ఏమిటంటే.టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ – ఉపాసన జంటకి కూడా వీరి వివాహానికి ఆహ్వానం అందింది.
అయితే ఈ వివాహ వేడుకకు రామ్ చరణ్ ఉపాసన హాజరు కాలేకపోయారు.దీంతో తాజాగా కియార – సిద్ధార్థ్ దంపతులకు ఉపాసన క్షమాపణలు తెలియజేసింది.తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను కియారా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.“ఇప్పుడు మేం శాశ్వతంగా ఒక్కటయ్యాం.మా కొత్త ప్రయాణానికి మీ దీవెనలు కావాలి ” అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
దీంతో ఉపాసన స్పందిస్తూ.” ‘కంగ్రాట్స్ కియారా.మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది.మీ పెళ్లికి మేం హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు.మీ ఇద్దరికీ మరోసారి నా అభినందనలు” అంటూ ఉపాసన కామెంట్ చేసింది.ఇదిలా ఉండగా నూతన దంపతులకు అలియా భట్, కత్రినా కైఫ్, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సమంత, రష్మిక మందన అనుపమ పరమేశ్వరన్ వంటి టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రస్తుతం కియారా సిద్ధార్థ మల్హోత్రా పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.