మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది రెండు సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ రెండు సినిమా ల్లో ఆచార్య తీవ్రంగా నిరాశ పరచగా గాడ్ ఫాదర్ సినిమా కాస్త పర్వాలేదు అనిపించుకుంది.
ఇక మొన్న సంక్రాంతి కి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా సమాచారం అందుతుంది.సినిమా మొత్తం 250 కోట్ల రూపాయల కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ మెగా ఫాన్స్ చాలా నమ్మకం తో ఉన్నారు.ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమా లు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
వాల్తేరు వీరయ్య సినిమా బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకున్న నేపథ్యం లో ఆయన తో సినిమా లు తెరకెక్కించేందుకు గాను మరింత మంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు.
చాలా కాలం తర్వాత చిరంజీవి నటించిన సినిమా బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఇదే సమయం లో మెగాస్టార్ నుండి ఈ సంవత్సరం ఏకంగా మూడు సినిమాలు రాబోతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా విడుదలైంది, మరో రెండు సినిమా లు ఏంటి అనేది మీ డౌట్ కదా.
అసలు విషయం ఏంటంటే భోళా శంకర్ సినిమా ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది.సమ్మర్ చివరిలో లేదా దసరా కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అంతే కాకుండా చిరంజీవి మరో సినిమా ను కూడా కమిట్ అయ్యి ఇదే సంవత్సరం చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.చిరంజీవి మరియు వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఆమధ్య సినిమా అనుకున్నారు.
కానీ అది వర్కౌట్ అవ్వలేదు.మరో దర్శకుడు తో ఏమైనా చిరంజీవి సినిమా మొదలు పెడతాడా అనేది చూడాలి.