మెగా హీరో చిరంజీవికి జనవరి 29 ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు.చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న” ఆచార్య” సినిమా టీజర్ విడుదల అయింది.
టీజర్ విడుదలైన కొద్దిసేపటికి మంచి స్పందన లభించడంతో ఫుల్ జోష్ లో ఉన్న మెగా హీరోలకు ఈ రోజు మరొక ప్రత్యేకత కూడా ఉంది.ఈ రోజు మెగాస్టార్ తన తల్లి అంజనాదేవి పుట్టిన రోజు కావడంతో వారి ఆనందం రెట్టింపయింది.
ఈ సందర్భంగా ఈ మెగా హీరోలు అందరూ కలిసి సందడి చేశారు.ముందుగా తన తల్లి అంజనాదేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఎమోషనల్ వీడియోను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
మెగాస్టార్ మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా మెగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా అంజనాదేవి మధ్యలో కూర్చోగా చిరంజీవి నాగబాబు దంపతులు, పవన్ కళ్యాణ్ తమ సోదరీమణులు విజయ దుర్గ, మాధవి చివరి వైపులా కూర్చొని ఉన్నారు.
మెగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కలసి తన తల్లికి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వీరందరూ కలసి దిగిన ఫోటోను నాగబాబు తన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ ఫోటోని షేర్ చేశారు.
నాగబాబు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఈ ఫోటోని షేర్ చేయడంతోపాటు, కొంతమందికి కొన్ని క్షణాలు ఎంతో సంతోషాన్ని ఇచ్చి వేడుక జరుపుకునే విధంగా ఉంటాయి.ఇలాంటి ఆనందకర క్షణాలకు, అంతులేని సంతోషాలకు నీ పుట్టినరోజు కారణం అమ్మ అంటూ ఈ ఫోటోను షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.ఈ ఫోటో చూసిన మెగా అభిమానులు మెగాస్టార్ తల్లికి పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.