మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘సర్దార్ గబ్బర్సింగ్’ ఆడియో వేడుక జరిగి పోయింది.ఈ వేడుకలో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మెగా బ్రదర్స్ చాలా కాలం తర్వాత ఒకే స్టేజ్పై కలుసుకోవడంతో మెగా ఫ్యాన్స్కు పండగే పండగ.మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్లు పక్క పక్కన నిలబడి స్టేజ్ షేర్ చేసుకుంటే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
అయితే ఈ బ్రదర్స్ చెప్పిన రొటీన్ డైలాగులు మాత్రం ఫ్యాన్స్కు బోర్ కొట్టాయి
ఎప్పుడు కూడా చిరంజీవి తన తమ్ముడు గొప్ప అని, అతను వైవిధ్యంగా ఆలోచిస్తాడు, మా కుటుంబంలో పవన్కు ప్రత్యేక స్థానం ఉంది.అంటూ ఇలా పలు వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.
గతంలో పలు సార్లు మెగా ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలు విన్నారు.పలు ఇంటర్వ్యూల్లో చిరంజీవి చెబుతుండగా ఫ్యాన్స్ చూశారు.
మళ్లీ ఇప్పుడు అదే పలుకులను మెగాస్టార్ పలికాడు.పవన్ కళ్యాణ్ గురించి కొత్త విషయాలు ఏమీ చెప్పకుండా అవే నాలుగు పాత మాటలు మాట్లాడాడు.
ఇక అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా తన అన్న గురించి గతంలో చెప్పిన మాటలనే చెప్పాడు.మద్యరాత్రి వరకు అన్న షూటింగ్స్ చేసి వచ్చే వాడు అని, అలసి పోయి వచ్చిన అన్నను చూసి కష్టం విలువ తెలుసుకున్నాను అంటూ పవన్ గతంలో పలు సార్లు చెప్పాడు.
మళ్లీ ఇప్పుడు కూడా అదే చెప్పాడు.ఇలా ఇద్దరు మెగా బ్రదర్స్ కూడా గతంలో చెప్పిన ముచ్చట్లేనే ‘సర్దార్ గబ్బర్సింగ్’ చిత్రం ఆడియో వేడుకలో కూడా రిపీట్ చేయడం జరిగింది.