కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల పెళ్లి కాని టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారవుతున్న సంగతి తెలిసిందే.డిసెంబర్ నెల 9వ తేదీన మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య వివాహం రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు మొదలు కాగా పెళ్లి పనులను స్వయంగా పర్యవేక్షించడానికి నిహారిక ఇప్పటికే ఉదయ్ పూర్ చేరుకున్నారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు.
ఈ వివాహానికి ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైన వారికి మాత్రమే ఆహ్వానం అందనుందని సమాచారం.ఆగష్టు నెలలో నిహారిక చైతన్య నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
సోషల్ మీడియాలో నిహారిక కాబోయే భర్త చైతన్యతో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.అయితే వీళ్ల వివాహం ప్రేమ వివాహమని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇకపోతే నాగబాబు అల్లుడికి లాంఛనం పేరుతో కానుకలు ఇవ్వనున్నారని తెలుస్తోంది.నిహారిక పేరుతో కోట్ల రూపాయల విలువ చేసే భవంతిని, 10 కోట్ల రూపాయల నగదును, దాదాపు రెండు కోట్ల విలువ చేసే బంగారాన్ని వరుడి కుటుంబానికి ఇవ్వనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అయితే ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.కట్నం అనే పేరు ఎత్తకుండా లాంఛనం పేరుతో నాగబాబు అల్లుడికి వీటిని ఇవ్వనున్నారని సమాచారం.
చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే చదువుకున్న చైతన్య ప్రముఖ కంపెనీలో బిజినెస్ స్ట్రాటెజిస్ట్ గా పని చేస్తున్నారు.భవిష్యత్తులో చైతన్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
చైతన్య స్టైలిష్ గా హీరో లుక్స్ తో ఉండటంతో భవిష్యత్తులో చైతన్య్ ఎంట్రీ ఖాయమని మెగా అభిమానులు భావిస్తున్నారు.