మెగా హీరో కొణిదెల నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నిర్మాతగా, నటుడిగా, పొలిటీషియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు, బుల్లితెరపై లాఫింగ్ స్టార్ గా బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు.
జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరించారు.జబర్దస్త్ అంటే నాగబాబు.
నాగబాబు అంటే జబర్దస్త్ అన్నంతగా ఆ షోకి హైప్ ని తీసుకువచ్చారు.అలాగే ఎంతో మంది కమెడియన్లకు అండగా నిలిచారు.
ఇక కొన్ని కారణాల వల్ల ఆ జబర్దస్త్ నుంచి విడిపోయి అదిరింది అనే షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.తాను వెళ్ళిపోతూ కొంతమంది కమెడియన్ లని తీసుకొని బయటకు వచ్చేశారు.
అదిరింది షో కొన్ని రోజులకే ఈ షో బెడిసి కొట్టింది.కొద్దిరోజులపాటు నాగబాబు ఈ అదిరింది షోలో కూడా కనిపించకుండా పోయారు.
ఇది ఇలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత నాగబాబు కామెడీ షో లో జడ్జిగా రీ ఎంట్రీ ఇచ్చారు.
స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోకి ఎంట్రీ ఇచ్చారు.నాగబాబు ఎంట్రీ ఇవ్వగానే శ్రీముఖి నాగబాబును ఇలా అడిగింది.ఆడియన్స్ మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు ఎందుకు ఇంత టైం పట్టిందని శ్రీముఖి అడగగా.
కొన్నిసార్లు అలా లేట్ అవుతుంది అంతే మనం ఏమి చేయలేం అని అన్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి వచ్చిన నాగబాబు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని లేదా తెలియాల్సి ఉంది.అయితే ఇది వరకు నాగబాబు స్థానంలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరించేవారు.
పలు కారణాల వల్ల శేఖర్ మాస్టర్ తప్పుకోగా ఆ స్థానంలో అలీ వచ్చారు అయితే ఇకపై నాగబాబు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.