మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. ఫ్యాన్స్ ప్రశంసలు!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.గత నెల 16వ తేదీన మెగాబ్రదర్ నాగబాబు కరోనా బారిన పడినట్టు కీలక ప్రకటన చేశారు.

 Mega Brother Naga Babu Donates Plasma After Recover Corona, Mega Brother Naga Ba-TeluguStop.com

సోషల్ మీడియా వేదికగా కరోనాను జయించి ప్లాస్మా దానం చేస్తానని చేస్తానని మాట ఇచ్చారు.అలా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నాగబాబు ప్లాస్మా దానం చేశారు.

నాగబాబు ప్లాస్మా దానం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సెప్టెంబర్ నెల 27వ తేదీన వైరస్ ను జయించిన నాగబాబు రెండున్నర వారాల తరువాత నిన్న చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ప్లాస్మా డొనేట్ చేశారు.

చాలామంది సెలబ్రిటీలు మొదట ప్లాస్మా డొనేట్ చేస్తామని చెప్పినా వైరస్ నుంచి కోలుకున్నా తరువాత వెనుకడుగు వేస్తున్నారు.వారికి భిన్నంగా నాగబాబు ప్లాస్మా డొనేషన్ చేసి ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇతర హీరోల అభిమానులు సైతం నాగబాబు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.

నాగబాబు ప్లాస్మా దానానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నిహారిక ఎంగేజ్మెంట్ జరిగిన మూడు రోజులకే నాగబాబుకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.చలిజ్వరంతో పాటు మత్తుగా అనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్న నాగబాబు కరోనా సోకిందని తెలియగానే తీవ్ర ఆందోళనకు గురయ్యానని అనంతరం రెమిడిసివర్ ఔషధం సహాయంతో కోలుకున్నానని చెప్పారు.

ఔషధం తీసుకున్న తరువాత తనకు జ్వరం, ఒళ్లునొప్పులు కనిపించలేదని అన్నారు.కరోనాకు ఎవరూ అతీతులు కారని ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రకంగా వైరస్ సోకే అవకాశం ఉందని చెప్పారు.

ఎవరికైనా దగ్గు, జ్వరం లాంటి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని కీలక సూచనలు చేశారు.కరోనా నుంచి కోలుకున్న తరువాత నాగబాబు పలు టీవీ షోలలో పాల్గొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube