మెగా బ్రదర్, ప్రముఖ నటుడు నాగబాబు ఈ మధ్య కాలంలో వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు.ఏడేళ్లు జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు వివిధ కారణాల వల్ల ఆ షోకు దూరమై జీ తెలుగు ఛానల్ లో అదిరింది షోకు జడ్జిగా వ్యవహరించారు.
అయితే అదిరింది షో హిట్ కాకపోవడంతో అదే షోను బొమ్మ అదిరింది పేరుతో శ్రీముఖి యాంకర్ గా మార్పులుచేర్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
గత ఆదివారం బొమ్మ అదిరింది షో ప్రారంభమైంది.
ఈ షోలో ఏపీ సీఎం జగన్, చంద్రబాబు, బాలకృష్ణ, రాజశేఖర్, పలువురు ప్రముఖులను టార్గెట్ చేస్తూ వివాదాస్పద స్కిట్ ప్రసారమైంది.ఈ స్కిట్ జగన్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగబాబు, యాంకర్ శ్రీముఖిని, స్కిట్ చేసిన వాళ్లను తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
కొందరు కమెడియన్లు ఇప్పటికే జగన్ ఫ్యాన్స్ ను క్షమాపణ కోరినా వారి ఆగ్రహం చల్లారలేదు.
వివాదం చెలరేగిన తరువాత నాగబాబు రాయల్ హెయిర్ ఆయిల్.
వెంట్రుక కూడా పీకలేరు అనే పోస్ట్ జగన్ ఫ్యాన్స్ కు మరింత ఆగ్రహం తెప్పించింది.నాగబాబు సింహాసనంలో కుక్క కూర్చున్న ఫోటో షేర్ చేయగా ఆ ఫోటో కూడా వివాదాస్పదం అయింది.
నాగబాబు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కొందరు సూచనలు చేస్తున్నా నాగబాబు మాత్రం వివాదాస్పద పోస్టులు పెడుతూనే ఉన్నారు.
తాజాగా నాగబాబు “ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం పిరికివాని లక్షణం, వాడు ఒక చెంప మీద కొడితే నువ్వు వాడి మొహం పగులగొట్టు” అని వివాదాస్పద పోస్ట్ చేశారు.
ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్లకు విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని నాగబాబు ఈ పోస్ట్ ద్వారా పరోక్షంగా అభిమానులకు సూచించారు.