మెగా ఫ్యామిలీ నుండి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.భారీ విజయాలను సొంతం చేసుకున్న మెగా ఫ్యామిలీ కి ఉప్పెన మాంచి కిక్ ఇచ్చిందని అభిమానులు అంటున్నారు.
ఎందుకంటే ఇలాంటి సినిమాను మెగా హీరో చేయడం అంటే మామూలు విషయం కాదు.హీరో ఆశీ పాత్రలో ఉన్న ట్విస్ట్ ను చాలా మంది జీర్ణించుకోలేరు.
అలాంటి పాత్రలను తెలుగు వారు ఎలా జీర్ణించుకుంటారో తెలియదు అయినా ఆశీ పాత్రకు వైష్ణవ్ తేజ్ ఓకే చెప్పాడు.ఉప్పెన సినిమా పై మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
స్టోరీ ఇలా ఉంటుంది అని నాకు ముందే తెలిసి ఉంటే ఖచ్చితంగా వైష్ణవ్ ను ఇలాంటి సినిమాలు చేయవద్దని చెప్పేవాడిని అన్నాడు.
కథను చాలా కన్విన్సింగ్ గా దర్శకుడు బుచ్చి బాబు ప్రజెంట్ చేసి ఆకట్టుకున్నాడు అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.
ఇలాంటి సబ్జెక్ట్ తో నా వద్దకు మరే హీరోలు కూడా వచ్చే అవకాశం లేదు.కనుక దీన్ని నేను చేస్తాను అనుకుని చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.గత ఏడాది విడుదల అవ్వాల్సిన ఉప్పెన సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.అదృష్టం కొద్ది సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాట బాగా పాపులర్ అయ్యింది.
ఆ పాట ఘన విజయం ను దక్కించుకున్న నేపథ్యంలో సినిమా పై అంచనాలు అందరిలో కూడా పెరిగాయి.అందుకే సినిమా పై జనాలు చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూడటం తో పాటు ఓపెనింగ్ రోజు భారీ వసూళ్లను వైష్ణవ్ కు ఇచ్చారు.
దాదాపుగా ఈ సినిమాకు పది కోట్ల రూపాయలు మొదటి రోజే వచ్చాయంటున్నారు.ఈ సినిమాలో నటించిన కృతి శెట్టి ప్రధాన ఆకర్షణగా నిలిచిన విషయం తెల్సిందే.