ఏపీ తెలంగాణ విభజన సమస్యలపై కేంద్ర హోమ్ శాఖ కీలక సమావేశాలు ముగిశాయి,దాదాపుగా విభజన సమస్యలపై చర్చించుకున్న ప్రతి అంశంలోనూ ఏపీకి షాక్ తగిలింది.ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన ఏ సమస్యపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నదే లేదు.
రైల్వే జోన్ ఏర్పాటు కూడా జరగదని రైల్వే బోర్డ్ తేల్చేసింది.రైల్వే బోర్డు నిర్ణయాన్ని క్యాబినెట్ కే వదిలేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి సూచించారు.
రాజధాని నిర్మాణానికి మరో వెయ్యి కోట్లు కావాలని ఏపీ కోరగా ఇప్పటికే ఇచ్చిన 1500 కోట్లకు లెక్కలు అప్పజెప్పలేదని కేంద్రం తెలిపింది.శివరామకృష్ణ కమిటీ 29 వేల కోట్లు ఇవ్వాలని ఏపీ సిఫార్సు చేసింది.
వెనుకబడిన ఏడు జిల్లాలకు నిధులు ఇవ్వాలంటూ ఏపీ కోరింది,పౌర సరఫరాల శాఖ బకాయిల అంకెల్లో తేడాలున్నాయన్న ఏపీ పేర్కొంది.ఎలాంటి నిర్ణయం లేకుండానే భేటీ అసంపూర్తిగా ముగిసింది.