కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది.జాతీయ స్థాయి నేతలు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు రూట్ మ్యాప్ పై పలు చర్చలు జరిపారు.
తాజాగా సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో భారత్ జోడో యాత్రపై సాయంత్రం కీలక భేటీ నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్, మాణిక్కం ఠాగూర్ పాల్గొననున్నారు.
కాగా తెలంగాణలో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను ఫైనల్ చేయనున్నారు.అయితే ఈ సమావేశానికి ముందు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మునుగోడు ఉపఎన్నికపై సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది.