ఇండియాలో సినిమా హీరోయిన్స్, క్రికెటర్స్ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది.మొదటి నుంచి ఈ రెండు రంగాలలో సెలబ్రిటీలుగా ఉన్న వారు డేటింగ్, రిలేషన్ షిప్ మెయింటేన్ చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు.
చాలా మంది క్రికెటర్స్ భార్యలు బాలీవుడ్ లో హీరోయిన్స్ గా రాణించారు.ప్రస్తుతం టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ భార్య భర్తలు అనే విషయం అందరికి తెలిసిందే.
యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ సతీమణిలు కూడా బాలీవుడ్ లో హీరోయిన్స్ గా రాణించారు.ఇలా చాలా మంది హీరోయిన్స్ క్రికెటర్స్ తో ప్రేమాయణం నడిపించి పెళ్ళిళ్ళు చేసుకుంటారు.
యువ క్రికెటర్లు కూడా తమ సీనియర్స్ చూపించిన దారిలోనే ముందుకి వెళ్తున్నారు.చిన్న వయస్సు నుంచే హీరోయిన్స్, మోడల్స్ లో రిలేషన్ షిప్ పెట్టుకుంటున్నారు.
భవిష్యత్తు టీం ఇండియా కెప్టెన్ గా ఇప్పటి నుంచి అందరితో ప్రశంసలు దక్కించుకుంటున్న యువ క్రికెటర్, ధోనీ వారసుడు రిషబ్ పంత్ కూడా బాలీవుడ్ భామలతో ప్రేమాయణం మొదలు పెట్టేశాడు.
మొన్నటి వరకు బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాతో ప్రేమాయణం నడిపించిన పంత్ ఇప్పుడు ఓ కొత్త మోడల్ లో పట్టాడు.
ఆమెతో చనువుగా ఉన్న ఫోటోలని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకొని ఆమెపై తన ప్రేమని నేరుగా వ్యక్తం చేశాడు.ఇంటీరియర్ డిజైన్ చేసి మోడలింగ్ లో రాణిస్తున్న ఇషా నేగితో పంత్ డేటింగ్ చేస్తున్నాడు.
నేగితో దిగిన ఫోటోలను తన ఇన్స్టాలో పెట్టేశాడు.ఇషా నేగిని ఎంత ఇష్టపడుతున్నాడో కూడా ఆ పోస్టులో క్లియర్గా చెప్పేశాడు.
నిన్ను నేనెప్పుడూ హ్యాపిగా ఉంచాలనుకుంటున్నా.ఎందుకంటే నేను హ్యాపిగా ఉండడానికి నువ్వే రీజన్ అంటూ తన పోస్టులో రాశాడు.
ఇషా నేగి కూడా రిషబ్తో దిగిన ఫోటోను తన ఇన్స్టాలో షేర్ చేసింది.నువ్వే నా హీరోవి, నువ్వే నా ఆత్మవి, నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే, నా జీవితానికి నువ్వే ప్రేమవని ఆమె తన పోస్టులో రాసింది.
ఇలా ఒకరికొకరు తమ పోస్టులతో ప్రేమ విషయాన్ని బహిరంగంగా చెప్పుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.