తమిళ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ కోలీవుడ్ లో గత కొద్ది కాలంగా వరుసగా పెద్ద స్టార్స్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ మీడియాలో హడావిడి చేస్తుంది.ఈ మధ్య కాలంలో ఎవరో ఒకరు పెద్ద స్టార్స్ ని తిడితే వారి ఫ్యాన్స్ చేసిన ట్రోల్స్ తో మనం కూడా స్టార్స్ అయిపోవచ్చు అనే థియరీని చాలా మంది ఫాలో అవుతున్నారు.
తెలుగులో కొంత మంది అలాగే పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ, అదే పనిగా వారి మీద విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో కావాల్సినంత హైప్ తెచ్చుకున్నారు.ఇప్పుడు ఇదే కోవలోకి కోలీవుడ్ నటి మీరా మిథున్ కూడా చేరినట్లు కనిపిస్తుంది.
గత కొంత కాలంగా ఆమె చేస్తున్న విమర్శల తీరు చూస్తూ ఉంటే కావాలని స్టార్ సెలబ్రిటీలని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.ఆ మధ్య స్టార్ హీరోయిన్ త్రిష మీద తీవ్ర ఆరోపణలు చేసి అందరి దృష్టిలో పడింది.త్రిషకు కులపిచ్చి ఎక్కువని, ఆమె ఇండస్ట్రీలో తనను తొక్కేయడానికి ప్రయత్నించిందని చెప్పింది.తాజాగా కోలీవుడ్ స్టార్లు సూర్య, విజయ్ లపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది.తమిళ ఇండస్ట్రీలో ఈ హీరోలకి ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ముఖ్యంగా హీరో విజయ్ కి రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో తమిళనాట ఇమేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
అయితే ఈ ఇద్దరు స్టార్స్ కి ఇప్పుడు మీరా మిథున్ నెపోటిజం అంటగట్టింది.కోలీవుడ్ లో నెపోటిజం వల్లే వీరిద్దరూ తెరపైకి రాగలిగారని, ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని విమర్శించింది.
సొంత ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసే శక్తి కూడా వీరికి లేదని, చేతికి గాజులు తొడుక్కుని కూర్చుంటారని మండిపడింది.ఈ వ్యాఖ్యలు తమిళనాట కలకలం రేపాయి.
మీరా వ్యాఖ్యలను సినీ ప్రముఖులు సైతం తప్పుపడుతున్నారు.ఈ సందర్భంగా సూర్య స్పందిస్తూ తక్కువ స్థాయి వ్యక్తులు చేసే విమర్శలపై స్పందిస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దని చెప్పాడు.
విలువైన ఆ సమయాన్ని సమాజం కోసం వినియోగించాలని సూచించాడు.