టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా సలార్.ఈ సినిమాను ప్రశాంత్ నీల్ హై వోల్టాజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.
హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.
ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో శృతి హాసన్ నటిస్తుంది.
ప్రభాస్ తొలిసారి శృతి హాసన్ తో నటిస్తున్నాడు.
అందుకే ఫ్యాన్స్ ఈ జంట తెరమీద ఎలా ఉంటదా అని ఉహించు కుంటున్నారు.ఈ భారీ యాక్షన్ సినిమాలో చాలా మంది ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ సరసన మరొక హీరోయిన్ కూడా ఉందట.రెండవ హీరోయిన్ గా రవితేజ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తుందని సమాచారం.
ఇప్పటికే ఈ బ్యూటీ సుశాంత్ సరసన ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాలో నటించి పర్వాలేదనిపించింది.ఇక ప్రెసెంట్ ఈ బ్యూటీ రవితేజ కు జోడీగా ఖిలాడీ సినిమాలో నటిస్తుంది.
ఇప్పుడు ప్రభాస్ సరసన నటించే లక్కీ ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది.ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14 2022 న రిలీజ్ కాబోతుంది.
ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు.భారీ ఇతిహాస రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.వీటితో పాటు రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమాలు కూడా చేస్తున్నాడు.