తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ తదితర స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఇచ్చినటువంటి నటి మీనా గురించి తెలియని వారుండరు.అయితే ఈమె అప్పట్లో తెలుగులో నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా నటించినటువంటి నవయుగం అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది.
అయితే సినీ పరిశ్రమలోకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సంపాదించి ఒక్క తెలుగులోనే కాక తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషల్లో కూడా నటించే అవకాశాలు దక్కించుకుంది.అయితే తాజాగా నటి మీనా సోషల్ మీడియా మాద్యమాల ద్వారా షేర్ చేసినటువంటి ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కి పెళ్ళవడం అప్పట్లో తనను ఎంతగానో బాధించిందని సరదాగా చెప్పుకొచ్చింది. అలాగే ఎంతో మంది అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా ఉన్నటువంటి హృతిక్ రోషన్ తనకు చాలా ఇష్టమని పేర్కొంది.
అంతేగాక హృతిక్ రోషన్ పెళ్లి పెళ్లి సమయంలో శుభాకాంక్షలు తెలుపుతూ దిగినటువంటి ఫోటోని కూడా సోషల్ మీడియా మాద్యమాల ద్వారా తన అభిమానులతో పంచుకుంది.ప్రస్తుతం నటి మీనా చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి మీనా చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో విక్టరీ వెంకటేష్ తో కలసి నటించిన “దృశ్యం” అనే చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అయితే ప్రస్తుతం మీనా పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
అలాగే తమిళం, మలయాళం భాషలకు చెందినటువంటి పలు చిత్రాల్లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటిస్తోంది.