చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోయిన్ గా సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి మీనా.ఈ భామ సౌత్ లో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో అన్ని భాషలలో స్టార్ హీరోలుగా ఉన్న అందరితో ఆడిపాడింది.
తెలుగులో కూడా బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్స్ తో సూపర్ హిట్ సినిమాలలో నటించింది.ఇక ఈ భామ కెరియర్ లో సక్సెస్ సినిమాలు కూడా ఎక్కువే.
హీరోయిన్ గా కెరియర్ ముగిసే దశలో ఈమె పెళ్లి చేసుకొని సెటిల్ అయిపొయింది.ఇక చాలా గ్యాప్ తర్వాత తెరి సినిమాలో మీనా కూతురుని చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసింది.
తల్లిలాగే మీనా కూతురు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు మంచి సినిమాలు చేస్తుంది.
ఇక ఆమె కూడా చాలా కాలం తర్వాత మరల రీ-ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తుంది.
మలయాళంలో దృశ్యం సినిమాలో మీనా కీలక పాత్రలో నటించింది.తెలుగు రీమేక్ లో కూడా ఆమె చేసింది.
దీంతో ఆ తరహా పాత్రలకి మీనా యాప్ట్ అని దర్శకులు కూడా భావించడంతో ఆమెకి అవకాశాలు భాగానే వస్తున్నాయి.ప్రస్తుతం తమిళంలో ఓ కామెడీ ఎంటర్టైనర్ గా పూర్తి స్థాయి లీడ్ రోల్ చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈమె మీడియాతో తన సినిమాల ఛాయస్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.తనకు ప్రత్యేక పాత్రలు చేయాలంటే మొదటి నుంచి ఆసక్తి ఉందని, అలాంటి పాత్రల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని చెప్పుకొచ్చింది.
అలాగే నెగిటివ్ షేడ్స్, విలన్ పాత్రల కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నా అని మీనా చెప్పడం విశేషం.మరి మీనా కోరుకున్నట్లు అలాంటి పాత్రలు ఎవరు ఇస్తారు అనేది వేచి చూడాలి.
.