సౌత్ సీనియర్ హీరోయిన్ మీనా అండ్ ఫ్యామిలీ కరోనా బారిన పడినట్టు ఆమె వెల్లడించారు. 2022లో మా ఇంటికి మిస్టర్ కరోనా గెస్ట్ వచ్చారని చెప్పారు.
మీనాతో పాటుగా ఫ్యామిలీ మొత్తానికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టుగా ఆమె సోషల్ మీడియాలో చెప్పారు.ప్రస్తుతం సింటమ్స్ మాములుగానే ఉన్నాయని.
హోం ఐసోలేషన్ లో ఉన్నామని అన్నారు.కరోనా మళ్లీ తీవ్రంగా విజృంభిస్తుంది.
ఓ పక్క బాలీవుడ్ లో చాలామంది స్టార్స్ కు కొవిడ్ వచ్చింది.
లేటెస్ట్ గా మీనా ఫ్యామిలీకి కరోనా సోకినట్టు చెప్పారు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే కొవిడ్ మహమ్మారి ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది.తమ ఫ్యామిలీ కరోనా బారిన పడిన విషయాన్ని వెల్లడించిన మీనా మీరంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
తమ గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని మీనా తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.మీనా ఫ్యామిలీకి కరోనా అని తెలియగానే ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతూ ఆమె సోషల్ మీడియా ఖాతాకి వరుస మెసేజ్ లు చేస్తున్నారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఎక్కువవుతున్న సందర్భంగా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలతో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి.