ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్నది ఏదైనా ఉందా…? అంటే అది కరోనా వైరస్ మాత్రమే.చైనాలోని విహాన్ లో మొదలై ఇతర దేశాలకు కూడా చైనా నుండి ప్రయాణించేవారి ద్వారా కరోస్ వైరస్ వ్యాపిస్తూ ప్రజలు ప్రాణాలను భయం గుప్పిట్లో పెట్టుకొని బ్రతికేలా చేస్తోంది.
చైనాలోని విహాన్ లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పటికే 106 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.దాదాపు 4000 మంది కరోనా వైరస్ బారిన పడినట్టు అధికారికంగా వెల్లడవుతోంది.
ఎటువంటి మందులు లేని ఈ వైరస్ బారి నుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్న తరుణంలో తమిళనాడుకు చెందిన ఒక వైద్యుడు తాను కరోనా వైరస్ కు మందు కనిపెట్టానని మీడియా ముఖంగా ప్రకటన చేశాడు.పూర్తి వివరాలలోకి వెళితే చెన్నైలోని రత్న సిద్ధా ఆస్పత్రికి చెందిన థానికా చలమ్ వేణి అనే వైద్యుడు హెర్బల్ ఆయిల్ నుండి ఒక మంచి ఔషధాన్ని తయారు చేశామని ఈ మందు కరోనా వైరస్ బారిన పడిన వారికి దివ్యౌషధంలా పని చేస్తుందని చెప్పారు.
ఈ మందును వాడితే ఎటువంటి వైరల్ జ్వరమైనా 24 గంటల నుండి 40 గంటల లోపు తగ్గుతుందని చెప్పారు.తన బృందంతో కలిసి కరోనా వైరస్ కు మందును తయారు చేశానని 24 గంటల నుండి 40 గంటల లోపు ఈ వైరస్ బారిన పడిన వారు సాధారణ మనుషులవుతారని వేణి అన్నారు.చైనా ప్రభుత్వం అనుమతి ఇస్తే చైనాలోని బాధితులకు కూడా తమ ఔషధాన్ని పంపిణీ చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా వైరస్ విషయంలో సహాయం చేయడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు.